Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




పుస్తకాలు మరియు పుస్తకము

(ఆఖరి తీర్పుపై ప్రసంగము)
THE BOOKS AND THE BOOK
(A Sermon on the Last Judgment)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జనవరి 25, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, January 25, 2015

"మరియు గొప్ప వారేమి, కొద్ది వారేమి మృతులైన వారందరు, ఆ సింహాసనం ఎదుట నిలువబడి యుండుట చూచితిని; అప్పుడు గ్రంథములు విప్పబడెను: మరియు జీవ గ్రంథమును, వేరొక గ్రంథము విప్పబడెను: ఆ గ్రంథముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళ లోకమును వాటి వశమున నున్న మృతులను నప్పగించెను: వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. ఈ అగ్ని గుండము రెండవ మరణము" (ప్రకటన 20:12-14).


నా భార్య నేను వివాహము చేసుకున్న తరువాత ఇశ్రాయేలు వెళ్ళాము. తిరిగి వస్తున్నప్పుడు రోమ్ లో కొన్ని రోజులు ఆగాము. ఇతర ప్రాంతాలలో, వేటికన్ వెళ్ళాము, సెయింట్ పీటర్ బాసిలిక, అక్కడ పోప్ నడిపిస్తాడు అక్కడ శతాబ్దాలుగా కళల నిధులున్నాయి. సిస్టీన్ చాపెల్ సీలింగ్ చూడాలని కోరేవాడిని. అక్కడ మికలేంగేలో (1475-1564) ప్రపంచంలో గొప్ప కళా నిధులు చెయ్యబడ్డాయి. అది బైబిలు ఘడియలు సూచిస్తుంది, మానవ సృష్టి, మానవుని పతనము, మన ఆదిమ తల్లిదండ్రులు వనము నుండి వెళ్ళగొట్టబడడం, మొదలైనవి, బైబిలు అంతటిలో. గచ్చుపై చిత్రాలు సీలింగ్ లో ఉన్నాయి. ఇంకొక పోపు మికలాంగేలోకి ఆజ్ఞాపించాడు గోడపై చివరి తీర్పును చెక్కించమని. అది ప్రభువు సంచలన దృక్పథము పాతాళపు నరకంలోనికి నెట్టబడే వారి పట్ల. అగ్ని గంధకాలలో మునుగు వ్యక్తి నిన్ను తన ముఖముపై భయ ఆశ్చర్యాలతో నీ వైపు చూడడం. ఆ పెద్ద చిత్ర కళను ఆఖరి తీర్పును సూచించేదీ, చూస్తూ నిలబడి పోయాను. ఎన్నిసార్లు ఒక పోపు లేక పెద్ద గత వంద సంవత్సరాలలో చిత్రపటము ముందు నిలబడి చూసి ఉంటారో, ఆఖరి తీర్పును గూర్చి బోధించారో. వారెవరూ అలా చేసి ఉండరు!

మన బాప్టిస్టు ప్రోటేస్టెంట్ సంఘాలు తక్కువ కాదు. నిజానికి మనం ఇంకా చెడ్డ వాళ్ళం. కనీసం వారికి ప్రజలకు గుర్తు చెయ్యడానికి ప్రసిద్ధి పటాలు ఉన్నాయి. బాప్టిస్టు సంఘమయితే, ప్రాముఖ్య స్త్రీలు, సండే స్కూలు సూపరిండెంట్ లేక క్రైస్తవ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అనుకోని ఉండవచ్చు అది చాల విపరీతమని, చిన్న పిల్లలు చూడడానికి భయము కలిగించేది అని. ఒక మధ్యాహ్నము కాపరి లోపలి వెళ్లి ఆ స్త్రీ ఎవరినైనా రప్పించి దానిపై తెల్ల పెయింట్ వేయించే వారు! మికలేంజలో ఆఖరి తీర్పు సిస్టీన్ చాపెల్ లో 450 సంవత్సరాలకు పైగా నిలిచింది. నా సందేహము సండే స్కూలు స్త్రీలు బాప్టిస్టు సంఘములో నాలుగు సంవత్సరాలు కూడా ఉండని చ్చేవారు కాదు! సువార్తిక సంఘములో కూడా!

మీరనుకుంటున్నారా నేను బాప్టిస్టు సువార్తిక సంఘాల పట్ల కఠినంగా ఉన్నావని? ఉండవలసినంత కఠినంగా లేనేమో!!!

బాప్టిస్టు కాపరి నరకమును గూర్చి ప్రసంగము చెప్పడం ఆఖరిసారి ఎప్పుడు విన్నారు? సువార్తిక ఆకర్షిత కాపరి నరకమును గూర్చి బోధించడం ఆఖరిసారిగా ఎప్పుడు విన్నారు? గత 150 సంవత్సరాలలో జాతీయ స్థాయి ఉజ్జీవము మనము అనుభవించక పోవడంలో ఆశ్చర్యము లేదు!

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ఉజ్జీవము పై గొప్ప విధ్యార్ధి అధికారి. తానూ అన్నాడు, "...క్రైస్తవ సంఘములో స్త్రీ పురుషులు తగ్గించుకొని వినయులై, ఈ పరిశుద్ధ నీతి గల, అవును, కోపపడు దేవుని, ముందు సాష్టాంగ పడకపోతే, ఉజ్జీవ నిరీక్షణ నాకు కనబడుట లేదు" (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1987, p. 42). అలా ఈ గొప్ప బోధకుడన్నాడు, "నేను చేయగలిగినంత చేస్తాను మిమ్ములను హెచ్చరించడానికి నరక దృశ్యాల ద్వారా. నిత్య పశ్చాత్తాపము, నిత్య దురవస్థ, నిత్య అసహ్యత, మారని చిత్ర హింస, ఇది పరిస్థితి చాల మంది వాటితో ఏకీభవిస్తూ తృప్తి పడతారు సువార్తను ఆహ్లాదిస్తారు, కాని వారు...అంతావిడిచిపెట్టి హృదయ పూర్వకంగా హత్తుకోరు" (Lloyd-Jones, Evangelistic Sermons, The Banner of Truth Trust, 1990, p. 161).

తప్పకుండా క్రైస్తవ చరిత్రను గూర్చి కొంచెం తెలిసిన వ్యక్తి యైనా జాన్ వేస్లీని ఎరిగి యుంటాడు! వెస్లీ (1703-1791) అతని మనం పిలుస్తాం "ఎపిస్కో పాల్ యాజకుడు." కాని దేవుడు అతనిని ఒక నాయకునిగా ఉపయోగించు కున్నాడు గొప్ప జాతీయ స్థాయి ఉజ్జీవము చరిత్రలో, మేథ డిస్ట్ మేల్కొలుపు విషయంలో. నరకమును గూర్చి జాన్ వెస్లీ ఏమి చెప్పాడో వినండి.

"దుష్టులు...నరకంలో పడతారు, దేవుని మరచిన అందరు. వారు. ‘ప్రభువు సన్నిధి నుండి తొలగింపబడి, అతని మహిమ శక్తి నుండి తొలగింపబడి నిత్య నాశనంతో శిక్షింపబడతారు.’ వారు ‘గంధకంతో మండు అగ్ని గుండములో పడవేయబడతారు,’ అసలు అది ‘దెయ్యము తన దూతలకు సిద్ధ పరచబడింది;’ ఏడ్పును పండ్లు కొరుకుటయుతో, దేవుని శపిస్తూ పైకి చూస్తారు. నరక కుక్కలు – గర్వము, అసూయ, ప్రతీకారము, ఆగ్రహము, భయంకరత్వము, నిస్పృహ – వారిని మ్రింగి వేస్తుంటాయి. అక్కడ ‘వారికి విశ్రాంతి ఉండదు, రాత్రి పగలు, కాని వారి చిత్ర హింసల పొగ నిత్యత్వములో పైకి వెళ్తూ ఉంటుంది!’ వారికి అక్కడ ‘అగ్ని ఆరదు, పురుగు చావదు.’" (John Wesley, M.A., “The Great Assize,” The Works of John Wesley, volume V, Baker Book House, 1979 edition, p. 179).

అతని మరణం సమయంలో అతని అజమాయిషీలో ఉన్న మెథడిస్ట్ సమాజముల నుండి ఎనభై వేలమంది వచ్చారు (ఐబిఐడి., పేజీ 45). 1834 లో 619, 771 మంది సభ్యులున్నారు. ఈ గొప్ప సువార్తికుడు నరకంపై బోధింపడానికి భయపడలేదు, అంతేకాక పరలోకములో ప్రవేశింపడానికి నిజ మార్పిడి అవసరత. ఈనాటి యునైటెడ్ మెథడిస్ట్ సంఘము మట్టిలో కలిసిపోయి వెస్లీ బోధనా విధానాన్ని ఎప్పుడో వదిలేసింది! వారి తెగను కాపాడుకోవడానికి వెస్లీ బోధించిన విషయాలకు తిరిగి రావాలి. ఊపిరి బిగపట్టకండి! చరిత్ర చూపిస్తుంది మత భ్రష్టుడు మత భ్రష్టుడు గానే ఉండిపోతాడు!

ఇప్పుడు స్పర్జన్ చెప్పింది వినండి. డాక్టర్ జాన్ బ్రౌన్ 1899 లో యాలే విశ్వ విద్యాలయంలో స్పర్జన్ ను గూర్చి ఇలా చెప్పాడు. అతడు స్పర్జన్ సేవను ఇలా పొగిడాడు "వైట్ ఫీల్డ్ వెస్లీ దినాల నుండి ఇంగ్లాండులో సమాంతరము కాని విజయము." డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్, టెక్సస్, డల్లాస్, మొదటి బాప్టిస్టు సంఘ కాపరి, రెండుసార్లు దక్షిణ బాప్టిస్టు సంఘ అధ్యక్షుడు అన్నాడు, "స్పర్జన్ అన్ని కాలాలలో ఒక గొప్ప బోధకుడు, ఆయన సందేశము అన్ని తరాలకు సంధర్భాను సారము మరియు వర్తిస్తుంది." ఇప్పుడు వినండి గొప్ప స్పర్జన్ నరకమును గూర్చి ఏమి బోధించారో.

"ఈ తీర్పు శరీరమును ఆత్మను అగ్ని గుండములో పడేస్తుంది...దేవుని సన్నిధి లేని స్థలము నరకము – పాప అభివృద్ధి స్థలము, ఏ భావానికి హద్దు ఉండదు, కామానికి అదుపు ఉండదు – రాత్రి పగలు పాపము చేసే వారిని దేవుడు రాత్రి పగలు శిక్షించే స్థలము – ఆ స్థలములో నిద్ర ఉండదు, విశ్రాంతి ఉండదు, నిరీక్షణ ఉండదు – ఆ స్థలములో నీటి బొట్టు తిరస్కరించబడుతుంది, దాహమున్నను నాలుక మండుతుంది – ఆ స్థలములో సుఖము ఉండదు, వెలుతురు ఉండదు, ఓదార్పు వినబడదు – స్థలములో సువార్త తిరస్కరింపబడుతుంది, కనికరము తెగి చనిపోతుంది...అగ్ని గుండము స్థలము – ఆ స్థలము, ఊహా చిత్ర పటము ఉండదు. మీరు చూడకూడని స్థలముగా దేవుడు సహాయము చెయ్యాలి...చనిపోయిన, పాపి, నరకంలో నుండి బయటకు రావడం అసంభవము; నశించిపోతే, నిత్యత్వములో...ఆలోచించండి! ఆలోచించండి! ఈ హెచ్చరిక ఆఖరిది ఎన్నటికి వినరు" (C. H. Spurgeon, “The First Resurrection,” The Metropolitan Tabernacle Pulpit, volume VII, Pilgrim Publications, 1986 reprint, p. 352).

నేను చెప్పుకుంటూ పోవచ్చు నరకాన్ని గూర్చి లూథర్, బన్ యెన్, ఎడ్వర్డ్, వైట్ ఫీల్డ్, మూడీ, డాక్టర్ జాన్ ఆర్. రైస్, ఇంకా గొప్ప బోధకులు ఆయాకాలలలో చెప్పిన విషయాలను గూర్చి. కాని అది సరిపోతుంది. నన్ను చెప్పనివ్వండి నరకాన్ని గూర్చి ఎప్పుడు బోధింపని కాపరి నమ్మదగిన వాడు కాదు, లేఖనాలకు సత్యవంతుడు కాదు, వినదగిన వ్యక్తి కాదు. ఎందుకు? అతడు "దేవుని ఉపదేశమంతటిని" బోధించుట లేదు! (అపోస్తలుల కార్యములు 20:27). అతడు పౌలు వలే, పేతురు వలే, యేసు క్రీస్తు వలే బోధించుట లేదు – వారు తీర్పు మీద నరకమును గూర్చి బైబిలులో అందరికంటే ఎక్కువగా బోధించాడు. అలాంటి వ్యక్తిని గూర్చి వినబడుట లేదు! తీర్పును గూర్చిన నరకమును గూర్చి అతనిని నమ్మలేకపోతే, వేరే విషయాలను గూర్చి ఎలా నమ్మగలరు?

పాఠ్య భాగము చూడండి. నేను చదువుతూ ఉండగా దయచేసి నిలువబడండి.

"మరియు గొప్ప వారేమి, కొద్ది వారేమి మృతులైన వారందరు, ఆ సింహాసనం ఎదుట నిలువబడి యుండుట చూచితిని; అప్పుడు గ్రంథములు విప్పబడెను: మరియు జీవ గ్రంథమును, వేరొక గ్రంథము విప్పబడెను: ఆ గ్రంథముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళ లోకమును వాటి వశమున నున్న మృతులను నప్పగించెను: వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. ఈ అగ్ని గుండము రెండవ మరణము" (ప్రకటన 20:12-14).

కూర్చోండి. బైబిలు తెరిచి ఉంచండి.

దీనిని "ఆఖరి తీర్పు" అంటారు ఎందుకంటే దీని తరువాత తీర్పులు లేవు. ఇది చివరిది. ధవళ సింహాసనముపై క్రీస్తు ఆశీనుడవుతాడు. అపోస్తలుల కార్యములు 17:31 ఇతర లేఖనాలు చూపిస్తున్నాయి క్రీస్తు తీర్పరి అని. క్రీస్తు రక్షకుడుగా ఉండడు. రక్షణ కాలము అయిపొయింది. క్రీస్తు పాపులను రక్షింపడు. నశించు పాపులకు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు రక్షింప బడిన వారిని నశించిన వారిని నిర్ణయించరు. ఈ జీవితంలో అది నిర్ణయింప బడుతుంది. నీవు నశించు వ్యక్తిగా చనిపోతే, ఈ సమయంలో నీవు తీర్పు తీర్చబడతావు. 12వ వచనము రక్షింపబడిన చనిపోయిన వ్యక్తిని గూర్చి మాట్లాడుతుంది. ఇలా అంటుంది,

"మరియు గొప్ప వారేమి, కొద్ది వారేమి మృతులైన వారందరు, ఆ సింహాసనం ఎదుట నిలువబడి యుండుట చూచితిని; అప్పుడు గ్రంథములు విప్పబడెను: మరియు జీవ గ్రంథమును, వేరొక గ్రంథము విప్పబడెను: ఆ గ్రంథముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, మృతులు తీర్పు పొందిరి" (ప్రకటన 20:12).

మనకు చెప్పబడింది "పుస్తకాలు" ఉంటాయని "జీవ గ్రంథము" ఉంటుందని. "పుస్తకాలు" నీ జీవిత కాలములో నీ "క్రియలు"ను గూర్చి వ్రాయబడినవి. "గొప్పవారేమి, కొద్ది వారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట [నిలువబడుదురు]" (20:12). గొప్పవారు ప్రముఖులు ఉంటారు. "అల్పులు" కూడా ఉంటారు. రక్షింపబడని ఏ వ్యక్తి తీర్పును తప్పించుకోలేడు. రక్షింపబడని ప్రతి మృతుడు తీర్పులో క్రీస్తు యెదుట నిలువ బడుతాడు. మునిగి పోయినవారు, సముద్రములో పాతి పెట్టబడిన వారు, పునరుత్ధాన శరీరాలలో అక్కడ ఉంటారు. సముద్ర జలాలలో ఈ శరీరాలు అంతరించి పోయాయి. కాని దేవుడు వారిని సమకూర్చి, తీర్పు కొరకు వారిని శరీరాలతో లేపుతాడు. సమాధులు శరీరాలను యిస్తాయి, నరకము (నరకము), నశించు ఆత్మలు వెళ్ళే స్థలము, "మృతుల శరీరాలిస్తాయి." వారి ఆత్మలు వారి శరీరాలు కలుపబడుతాయి, వారు ధవళ సింహాసనము ముందు నిలబడతారు. ఇలా చెయ్యడంలో దేవునికి సమస్య ఉండదు. ఆయన అధిక శక్తి మంతుడు. మళ్ళీ 12 వ వచనము వినండి,

"మరియు గొప్ప వారేమి, కొద్ది వారేమి మృతులైన వారందరు, ఆ సింహాసనం ఎదుట నిలువబడి యుండుట చూచితిని; అప్పుడు గ్రంథములు విప్పబడెను: మరియు జీవ గ్రంథమును, వేరొక గ్రంథము విప్పబడెను: ఆ గ్రంథముల యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున, మృతులు తీర్పు పొందిరి" (ప్రకటన 20:12).

ఇప్పుడు మీరు రక్షింపబడకపోతే, ఈ జీవితంలో, మీరు తీర్పు నొందుతారు "పుస్తకాలలో వ్రాయబడిన వాటిని బట్టి, [నీ] క్రియలను బట్టి," ఈ జీవితంలో నీవు చేసిన ప్రతీదానిని బట్టి.

డాక్టర్ జే.వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "మరణ పడకపై ఉన్న వ్యక్తి అన్నాడు, ‘బోధకుడు, భవిష్యత్ ను గూర్చి నాతో మాట్లాడనవసరం లేదు. నా అవకాశాలు తీసుకుంటాను. నేను నమ్ముతాను దేవుడు న్యాయవంతుడని నీతిమంతుడని నా క్రియలు బయలు పరచనివ్వండి.’" డాక్టర్ మెక్ గీ అన్నాడు, "మీరు సరియే. ఆయన నీతిమంతుడు న్యాయమంతుడు, నీ క్రియలు కనుపరుస్తాడు. ఆయన అదే చెప్తున్నాడా అదే చెయ్యబోతున్నాడు. కాని నీకు ఒక సమాచారం ఉంది: ఆ తీర్పులో ఎవడు రక్షింపబడడు, ఎందుకంటే నీ క్రియలను బట్టి నీవు రక్షింపబడలేవు...నీ చిన్న క్రియలు లెక్కలోనికి రానే రావు" (Thru the Bible, volume V, Thomas Nelson Publishers, 1983, p. 1060; note on Revelation 20:11).

అవును, నీకు "న్యాయ" తీర్పు ఉంటుంది. "పుస్తకాలు" జీవితంలో నీవు చేసిన సమస్తాన్ని కలిగియుంటాయి. డాక్టర్ మెక్ గీ "పుస్తకాలను" నీ జీవితపు విడియో టేపులతో పోల్చాడు. ఆయన అన్నాడు, "నీ జీవితపు టేపులో ఉంటుంది, క్రీస్తు ఆ టేపులను కలిగి యుంటాడు. ఆయన వినిపింప చేసినప్పుడు, నీవు వినగలుగుతావు [చూస్తావు]. అది నీకు మంచిగా అనిపించదు, ఏ విధంగా కూడా. దేవుని యెదుట నిలువబడి నీ జీవితపు టేపును వినాలని కోరుకుంటున్నాము? నేననుకుంటాను నీవు చూసేటట్టుగా టెలివిజన్ తెరపై ఆయన చూపిస్తాడు, కూడా. మిగిలినది నీ జీవితమూ తీసుకోగలదని నీవనుకుంటున్నావా? మీ గురుంచి నాకు తెలియదు, నేను అలా [చెయ్యను]...సామ్యూల్ జాన్సన్ [గొప్ప శబ్ద కోశితుడు] అన్నాడు, ‘ప్రతి వ్యక్తికి తనను గూర్చి తెలుసు కాని ప్రియ మిత్రునికి చెప్పడానికి ధైర్యము సరిపోదు.’ నీ గురించి, నీకు తెలుసు కదా? నీవు దాస్తున్న విషయాలు నీకు తెలుసు ప్రపంచంలో దేనిని బయలు పరచనని అనుకుంటావు. [దేవుడు] వాటిని తీర్పులోనికి తీసుకొని వస్తాడు; నీ చిన్న [మంచి క్రియలను] ప్రదర్శిస్తున్నప్పుడు, నిన్ను గూర్చి ఆయన చెప్తాడు" (మెక్ గీ, ఐబిఐడి.). అప్పుడు డాక్టర్ మెక్ గీ అన్నాడు, "దవల సింహాసనం తీర్పు నశించు వారిని గూర్చిన తీర్పు. [జన] సమూహాలు వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడాలనుకుంటారు. ఇది వారి అవకాశము. తీర్పు న్యాయము, కాని ఎవరు [మంచి] క్రియలను బట్టి రక్షింపబడలేదు" (ఐబిఐడి.).

గమనించండి దేవుడు "పుస్తకాలను" గూర్చి మాట్లాడుచున్నాడు, తరువాత "జీవ గ్రంథము" ను గూర్చి మాట్లాడుచున్నాడు. "జీవ గ్రంథము" యేసుచే రక్షింపబడిన ప్రతి ఒక్కరి పేరు కలిగి ఉంటుంది, "[క్రీస్తు] రక్తముచే దేవుని కొరకు విమోచింపబడిన" వారు జీవితంలో (ప్రకటన 5:9). యేసు క్రీస్తు రక్తము వారి పాపాల నుండి కడిగింది వారు ఈ జీవితంలో యేసును నమ్మినప్పుడు. వారి పేర్లు మాత్రమే "జీవ గ్రంథము"లో ఉంటాయి. వారు స్తుతిస్తూ పాడతారు "ఆయన మనలను ప్రేమించాడు, తన స్వరక్తము ద్వారామన పాపాల నుండి కడిగాడు" (ప్రకటన 1:5). ఈ జీవిత కాలంలో యేసుచే రక్షింపబడిన వారు మాత్రమే, ఈ జీవితంలో ఆయన రక్తముతో కడుగబడినవారు, వారి పేర్లు మాత్రమే "జీవ గ్రంథము" లో వ్రాయబడి ఉంటాయి.

గమనించండి "జీవ గ్రంథము" ఒకటే ఉంటుంది – కాని చాల "పుస్తకాల" ఉంటాయి అవి రక్షింపబడిన వారి పాపాలు కలిగి ఉంటాయి! ఒక బోధకుడు చెప్పింది గుర్తు వస్తుంది, "చాల ‘పుస్తకాలుంటాయి’ ఎందుకంటే చాల మంది నశించి పోయారు కాబట్టి. కాని ‘జీవ గ్రంధం’ ఒకటే ఉంటుంది, ఎందుకంటే కొంతమందే రక్షింపబడ్డారు." కాబట్టి, తరువాత, పదిహేనవ వచనము చూడండి,

"ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను" (ప్రకటన 20:15).

"అగ్ని గుండము" నిత్య నరకము, నిత్య చిత్ర హింస, నిత్య శ్రమ. ప్రభువైన యేసు క్రీస్తు అన్నాడు రెండు మార్గాలున్నాయి, ప్రతి ఒక్కరు రెండింటిలో ఒక మార్గము ద్వారా వెళ్తాడు. ఆయన అన్నాడు,

"ఇరుకు ద్వారమున ప్రవేశించుడి: నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆదారి విశాలము నైయున్నది, అది నాశనం చేయబడినది, మరియు దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు: ఎందుకనగా జీవమునకు పోవు ద్వారము ఇరుకును, తక్కువ వెడల్పు కలదు, ఆదారి సంకుచితము నైయున్నది, దానిని కనుగొను వారు కొందరే" (మత్తయి 7:13-14).

క్రీస్తు అన్నాడు, "కొద్దిమంది మాత్రమే [సరియైన మార్గాన్ని] కనుగొంటారు." "కొద్దిమంది మాత్రమే కనుగొంటారు." కొద్ది మందిలో నీవు ఒకడివవుతావా "జీవ గ్రంథములో" వ్రాయబడిన వారిలో? తీర్పునుండి నరకము నుండి తప్పించుకొను ఒకే మార్గము – ఒకే మార్గము – ఇప్పుడే, ఈ జీవితంలోనే యేసును నమ్మడం. నీ పాపము నుండి తొలగి యేసు వైపు తిరుగు! బైబిలు చెప్తుంది, "నీ చెడు మార్గముల నుండి తిరుగు; నీవెందుకు చనిపోవాలి?" (యేహెజ్కేలు 33:11). అపోస్తలుల కార్యముల గ్రంథములో "ఎక్కువ మంది నమ్మి, ప్రభువు వైపు తిరిగారు" (అపోస్తలుల కార్యములు 11:21). నీ స్వార్ధపు, పాపపు మార్గాల నుండి తిరిగి –యేసు క్రీస్తు వైపు తిరుగు.

"ఆయన రక్తము వలన మనకు విమోచనము, అపరాధములకు క్షమాపణ కలిగియున్నవి" (ఎఫెస్సీయులకు 1:7).

యేసు రక్తము నీ పాపాలన్నిటిని కప్పుతుంది, దేవుడు వాటిని చూడకుండా! రోమా గ్రంథము చెప్తుంది,

"తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు...ధన్యుడు" (రోమా 4:7).

యేసు రక్తము నీ పాపాలను "కప్పుతుంది" దేవుడు ఎన్నటికి చూడకుండా! యేసు రక్తము నీ పాపాలను కడిగేస్తుంది దేవుడు వాటిని ఎప్పటికి చూడకుండా! మళ్ళీ రోమా గ్రంథము చెప్తుంది,

"కాబట్టి ఆయన రక్తమున ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మరి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నిండి రక్షింపబడుదుము" (రోమా 5:9).

ప్రకటన 1:5 చెప్తుంది రక్షింపబడిన వారు ఎందుకు రక్షింపబడ్డారంటే యేసు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి "తన స్వరక్తముతో మన పాపాలు కడిగి వేసాడు కాబట్టి." ఆమెన్! యేసు నామాన్ని స్తుతించండి! డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ –జోన్స్, గొప్ప బోధకుడు, ఇలా అన్నాడు,

ప్రపంచపు పరిష్కారాలన్ని సరిపోవు నా పాపపు మరకలు పోగొట్టుకోడానికి, కాని దైవ కుమారుని రక్తము ఉంది, మచ్చలేనిది, నిందారహితమైనది, నా కనిపిస్తుంది అది శక్తి వంతమని.

     శక్తి ఉంది, శక్తి ఉంది, అద్భుత శక్తి ఉంది
     ప్రశస్త గొర్రె పిల్ల రక్తములో.
     ఆయన రక్తము అపరాధులను శుద్ధి చేస్తుంది,
     ఆయన రక్తము నా కొరకు అందుబాటులో ఉంది.
            (చార్లెస్ వెస్లీ)

అది మనకు ఆదరణ ఓదార్పు. (Martyn Lloyd-Jones, M.D., Fellowship with God, Crossway Books, 1994, p. 144).

ప్రభువా, నా పాపములు అనేకములు, ఇసుక రేణువుల వలే,
కాని మీ రక్తము, ఓ నా రక్షకా, నీకు సరిపడుతుంది;
మీ వాగ్ధానము వ్రాయబడింది, పెద్ద తేటయైన అక్షరాలతో,
"మీ పాపములు రక్తము వలే ఎర్రని వైనను, మంచు వలే తెల్లనివిగా చేయుదును."
అవును, నా పేరు వ్రాయబడింది, తెల్లని తేటయైన కాగితముపై,
మీ రాజ్య గ్రంథములో, ఔను, నా పేరు అచట వ్రాయబడింది!
("నా పేరు అచట వ్రాయబడిందా?" మేరి ఏ. కిడ్దర్ చే, 1820-1905).
      (“Is My Name Written There?” by Mary A. Kidder, 1820-1905).

నీవు చెప్పగలవా? ఈ ఉదయము అలా చెప్పగలవా? నీ రక్త పాపములు సిలువపై కార్చబడిన యేసు రక్తముచే కడుగబడ్డాయా? విశ్వాసము ద్వారా ఆయన యొద్దకు రమ్ము ఆయన దేవుని దృష్టిలో నిన్ను శుద్ధి చేస్తాడు! డాక్టర్ చాన్, ప్రార్ధనలో దయచేసి నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: ప్రకటన 20:11-15.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"నా పేరు అచట వ్రాయబడిందా?" (మేరి ఏ. కిడ్దర్ చే, 1820-1905).
“Is My Name Written There?” (by Mary A. Kidder, 1820-1905).